Tuesday, May 21, 2024

అర్జీలను త్వరగా పరిష్కరించాలి – ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌ రెడ్డి

ఉలవపాడు , : మండలంలోని రెవిన్యూ శాఖలో ఉన్న రైతుల సమస్యలను వెంటనే పూర్తి చేయాలని తహశీల్దారు కె.సంజీవరావుకు ఎమ్మెల్యే మానుగుంట మహీదర్‌ రెడ్డి ఆదేశించారు. స్థానిక రెవిన్యూ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌ రెడ్డికి రైతులు సమస్యలతో కూడిన అర్జీలను ఇచ్చారు. ఉలవపాడు మండలం కరేడు పంచాయితీ పరిధిలోని బట్టీ సోమయ్యపాలెంకు చెందిన మత్య్సకారులకు ఇళ్ళ స్థలాలు ఇవ్వవలసినదిగా అర్జీలు దాఖలుచేశారు. అయితే ఎమ్మెల్యే స్పందిస్తూ ఇళ్ళ స్థలాల కోసం స్థలాన్ని పరిశీలించి పట్టాలు ఇచ్చే విధంగా ఏర్పాట్లుచేయాలని ఆయన తహశీల్దారుకు తెలిపారు. ప్రతి బుధవారం నాడు సమస్యలు తెలుసుకోడానికి ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌ రెడ్డి రెవిన్యూ కార్యాలయానికి వస్తానని తెలిపారు. అనంతరం ఎంపిడిఓ కార్యాలయానికి వెళ్ళి అక్కడ వివిధ శాఖల సిబ్బందితో ఆయన సమావేశం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ రవికుమార్‌, ఈఓఆర్డీ చెంచమ్మ, వైఎస్‌ఆర్‌ పార్టీ నాయకులు ఆర్‌ సింగారెడ్డి, టౌన్‌ అధ్యక్షులు కృష్ణారెడ్డి, భీమయ్య తదితరులు వైసిపి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement