Sunday, April 28, 2024

పోలీస్ వాహ‌నం ఢీ.. ఒక‌రికి తీవ్ర‌గాయాలు

కర్లపాలెం:
పోలీస్ జీప్ ఢీకొని ఒక వ్యక్తి తీవ్ర గాయాలై కాళ్ళు విరిపోయిన సంఘటన గుంటూరు జిల్లా లో జ‌రిగింది. కర్లపాలెం నుండి బాపట్ల వెళ్లే మార్గంలో ముకుందా టీ స్టాల్ సమీపం లో ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. నగరం నుండి బాపట్ల వైపు వెళ్తున్న నగరం పోలీస్ జీప్ అతి వేగంతో ప్రయాణిస్తూ ఓ వెంచ‌ర్ స‌మీపంలో ఉన్న షెడ్డును ఢీ కొంది. దీంతో అది షెడ్ పడిపోయింది. జీప్ అదే వేగంతో ప‌క్క‌నే ఉన్న ముకుంద టీ స్టాల్ కి ముందు వెంచర్ కి నిర్మాణం చేసిన ప్రహరీని ఢీకొనడంతో అది కూడా నేలకొరిగింది. సమీపంలో ఉన్న ఎం వి రాజుపాలెం కి చెందిన బక్కా సాంబిరెడ్డి ని ఢీకొనడంతో కాళ్లు విరిగాయి. తీవ్ర ర‌క్త స్రావ‌మైంది. సమాచారం తెలుసుకున్న బాధితుని బంధువులు, గ్రామ‌స్తులు సంఘటన స్థలానికి చేరుకొని సాంబిరెడ్డి కి న్యాయం చేయాలని రోడ్ పై బైఠాయించి రాస్తా రోకో నిర్వహించారు. విషయం తెలుసుకున్న ఎస్ ఐ అంజయ్య రోడ్ పై బైఠాయించిన వారితో మాట్లాడి క్ష‌త‌గాత్రునికి, కుటుంబానికి న్యాయం చేస్తా అని హామీ ఇవ్వడం తో గ్రామస్తులు,బంధువులు రాస్తా రోకో ను విరమించుకున్నారు. క్ష‌త‌గాత్రుడు సాంబిరెడ్డిని చీరాల వైద్యశాల కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement