Saturday, May 4, 2024

శ్రీసిటీ పరిధిలో ఎర్రచందనం అక్రమ రమాణా.. ఆరుగురి అరెస్ట్

చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ హైటెక్ పోలీస్టేషన్ పరిధిలో పోలీసులు భారీగా ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు. మత్తేరిమిట్ట వద్ధ ఓ మామిడి తోపులో అక్రమ రవాణాకు సిద్ధంగా ఉంచిన ఎర్రచందనం దుంగలను పోలీసులు బుధవారం రాత్రి మాటువేసి పట్టుకున్నారు. ఈ దాడుల్లో పోలీసులు సుమారు నాలుగు లక్షల రూపాయల విలువ చేసే పది ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈకేసులో ప్రధాన నిందితుడిగా మత్తేరిమిట్ట యంపిటీసి కుమారుడు శిబి చక్రవర్తి ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఈ కేసులో పోలీసులు పి.హరిగోపాల్, జయరాజ్,  అనీస్, మునిక్రిష్ణ, శివకుమార్, హరిలను అరెస్ట్ చేశారు. ఎర్రచందనం దుంగలు దాచి ఉంచిన శ్యామలమ్మ మామిడి తోటలోనే పై ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఎర్రచందనం అక్రమ రవాణాకు వినియోగించిన ట్రాక్టర్, రెండు మోటారు బైకులను కూడా పోలీసులు సీజ్ చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement