Friday, May 3, 2024

ఎరువుల కోసం జాతీయ రహదారిపై రైతుల రాస్తారోకో

బిక్కనూర్ : ఎరువుల కోసం రైతులు జాతీయ రహదారిపై గురువారం రాస్తారోకో చేశారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామ సహకార సంఘం పరిధిలో గల రైతులు పెద్ద ఎత్తున ఎరువుల కోసం సహకార సంఘానికి వచ్చారు. అక్కడ ఎరువులు లేకపోవడంతో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రైతులకు కావాల్సిన ఎరువులు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement