Friday, May 17, 2024

పేదల పెన్నిధి పీవీజీ..

సింహాచలం, (ప్రభన్యూస్‌): విజయనగర సామ్రాజ్య మహారాజ చిట్టచివరి పట్టాభిషేక కర్త దివంగత సింహాచలం దేవస్థానం ధర్మకర్త పీవీజీరాజు పేద ప్రజలపాలిటి పెన్నిధి పలు దేవాలయాలకు మహారాజ పోషకులు విద్యాసంస్థల నిర్మాణ కర్త అని సింహాచలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎమ్‌.వి. సూర్యకళ అన్నారు. పి విజి 26వ వర్ధంతి సందర్భముగా సింహాచల దేవస్థానం కృష్ణాపురం గోశాలలో ఏర్పాటు- చేసిన పివిజి వర్ధంతి కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా అధికారులు సిబ్బంది నివాళులు అర్పించారు. ఉత్తరాంధ్రాలో సింహాచల క్షేత్రములో చేసిన సేవలు దాన ధర్మాలు గుర్తు చేసుకున్నారు. ధరణి ఉన్నంతకాలం పివిజి వంశీల కీర్తి ఉంటు-ందని నివాళులు అర్పించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement