Friday, May 10, 2024

ఏపీ బీజేపీ ఇన్చార్జి మురళీధరన్ తో పవన్ భేటీ

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఏపీలో క్రమంగా ఎన్నికల వాతావరణం నెలకొంటున్న పరిస్థితుల్లో పవన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కాసేపటి క్రితమే ఢిల్లీలో ఏపీ బీజేపీ ఇన్చార్జి మురళీధరన్ తో సమావేశమయ్యారు. ఈ భేటీలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, తాజా పరిణామాలపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలను కూడా పవన్ కలిసే అవకాశముంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement