Saturday, May 11, 2024

23న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్‌ కల్యాణ్‌ పర్యటన..

అమరావతి, ప్రభన్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి, వారికి అండగా నిలిచేందుకు ఈ నెల 23వ తేదీన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ పర్యటించనున్నారు. జనసేన కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా 23వ తేదీ ఉదయం 9 గంటలకు ఏలూరు బైపాస్‌ మీదుగా చింతలపూడికి వెళ్లి, ఆత్మహత్య చేసుకున్న కొంతమంది కౌలు రైతు కుటు-ంబాల ఇళ్లకు వెళ్లి మార్గం మధ్యలో పరామర్శిస్తారు. జనసేన పార్టీ తరఫున రూ. లక్ష పరిహారం అందిస్తారు.

అనంతరం చింతలపూడిలో జరిగే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. బలవన్మరణాలకు పాల్పడిన మరికొంత మంది రైతు కుటు-ంబాలకు ఈ సందర్భంగా చింతలపూడిలో రూ. లక్ష చెక్కులు అందచేస్తారు. అనంతపురము జిల్లాలో జరిగిన మొదటి విడత కౌలు రైతు భరోసా యాత్రలో 31 మంది కౌలు రైతు కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించిన విషయం విదితమే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement