Monday, April 29, 2024

పెద్దిరెడ్డిపై కేసు నమోదు చేయాలి.. పరిటాల సునీత నిరసన

అనంతపురం, ఆగస్టు 5 : మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై కేసు నమోదు చేయాలని మాజీ మంత్రి పరిటాల సునీత ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. పుంగనూరులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాన్వాయ్ పై జరిగిన దాడికి నిరసనగా మాజీ మంత్రి పరిటాల సునీత ఆధ్వర్యంలో మరూరు టోల్గేట్ వద్ద బైఠాయించారు. ఈ ఘటనకు కారణమైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై చర్యలు తీసుకొని కేసులు నమోదు చేయాలని సునీత డిమాండ్ చేశారు. నిరసన కారణంగా ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్న టీడీపీ నాయకులందరినీ రాప్తాడు పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement