Thursday, May 2, 2024

HYD: బర్త్ డే… మొక్కలు నాటిన రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు కిశోర్ గౌడ్

హైదరాబాద్, ఆగస్టు 4 (ప్రభ న్యూస్) : తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు కిశోర్ గౌడ్ మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తన పుట్టినరోజు సందర్భంగా అంబర్ పేటలోని తన నివాసం దగ్గరలో గల పార్క్ లో కిశోర్ గౌడ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కిశోర్ గౌడ్ మాట్లాడుతూ… వాతావరణం బాగుంటేనే ఈ భూమిపై మానవ మనుగడ సాధ్యమని, భవిష్యత్ తరాలకు మనం ఎంత ఆస్తి ఇచ్చామనేది కాకుండా ఎంత మంచి వాతావరణాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చామనేది ముఖ్యమన్నారు.

పచ్చదనాన్ని పెంపొందించి, వాతావరణ కాలుష్యం తగ్గించడం కోసం రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఆరు సంవత్సరాల క్రితం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే కార్యక్రమాన్ని చేపట్టి పల్లె నుండి దేశ విదేశాలకు విస్తరించే విధంగా చైతన్యం తీసుకురావడం జరిగిందన్నారు. ఈ రోజు ఏ శుభకార్యమైన అది పుట్టినరోజు కావచ్చు, పెళ్లి రోజు కావచ్చు, పదవి బాధ్యత స్వీకరణ కావచ్చు, గృహప్రవేశం కావచ్చు మొక్కలు నాటే ఆనవాయితీ రావడం జరిగిందన్నారు. ఇంత గొప్ప కార్యక్రమంలో తనను కూడా ఒక సభ్యునిగా ఉంచి, ఇందులో పనిచేసే అవకాశం కల్పించిన సంతోష్ కుమార్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. కాబట్టి సందర్భం ఏదైనా ఎవరికి తోచిన విధంగా వారు మొక్కలు నాటి వాటిని రక్షించాలని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement