Friday, May 17, 2024

మంత్రివర్గ తీర్మాన బిల్లును గవర్నర్ ఆమోదించాలి… గిరిమల్లె రాజు

జనగామ, ఆగస్టు 5 ప్రభ న్యూస్ : ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేసిన బిల్లుకు వెంటనే గవర్నర్ ఆమోదం తెలియజెసి బిల్ పాస్ చేయాలనీ టీఎంయూ రాష్ట్ర కార్యదర్శి గిరిమల్లె రాజు అన్నారు శనివారం జనగామ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కార్మికులు డిపో ఎదురుగా బస్సులను అపి నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపి తీర్మానించిన బిల్లును గవర్నర్ ఆమోదం తెలియజేసి బిల్ పాస్ చేయాలని ఆయన కోరారు. లేనిపక్షంలో ఆందోళన ఉదృతం చేస్తామన్నారు జనగామ డిపో ఉద్యోగులు.. ఈ కార్యక్రమంలో డిపో కార్యదర్శి LL పతి MBK రెడ్డి, శివరాత్రి, దుర్గయ్య, బాకీ రాజు, యాదగిరి, యుగేందర్, మాదవి, ప్రమీల, సమ్మక్క, రమ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement