Wednesday, May 15, 2024

పవన్ ను పరకాల టార్గెట్ చేశారా?

ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు పరకాల ప్రభాకర్ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ‘’ఇంకా కుక్కలు మొరుగుతూనే ఉన్నట్లున్నాయి. కానివ్వండి. మళ్ళీ రేపు తీరుబడి అయ్యాక ఒకొక్క కుక్కనీ మూతి పగిలేలా కొడతాను. ఏ కుక్కనీ నిరాశ పరచను. ఆఫీసుకి వెళ్ళి కిరాయి తీసుకోడం మర్చిపోకండి. రెండు చోట్ల పోటీ చేస్తే ఒక్కచోట కూడా గెలిపించుకోలేక పోయిన వాళ్ళు అంతకన్నా ఇంకేమి చెయ్యగలరు?” అని ట్వీట్ చేశారు. అయితే, పరకాల ప్రభాకర్ ఎవరి పేరును ప్రస్తావించకుండా చేసిన ఈ ట్వీట్… సంచలనంగా మారింది. పరోక్షంగా జనసేనను ప్రభాకర్ టార్గెట్ చేశారని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement