Friday, May 3, 2024

అవినీతి ఆరోపణ: పంచాయతీ అధికారిపై సస్పెన్షన్ వేటు

అనంతపురం జిల్లాలో అవినీతి అధికారిపై వేటు పడింది. జిల్లా పంచాయతీ అధికారి పార్వతిని సస్పెండ్ చేస్తూ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలు జిల్లా బనగానపల్లె స్పెషల్ ఆఫీసర్ గా పనిచేసిన సమయంలో పార్వతి అక్రమాలకు పాల్పడినట్లు రుజువు అయింది. 5.80 లక్షల రూపాయల స్వాహా జరిగినట్లు విచారణలో వెల్లడి అయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement