Saturday, May 11, 2024

Police: కాజీపేట‌లో పోలీసుల ర‌క్త‌దానం.. మరొకరి ప్రాణాలు కాపాడొచ్చ‌న్న సీపీ త‌రుణ్ జోషి..

పోలీస్ అమరవీరుల వారోత్సవాలు పురస్కరించుకొని హాసనపర్తి బాలాజీ గార్డెన్స్ లో బుధవారం ర‌క్త‌దానం కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. కాజిపేట్ పోలీస్ డివిజినల్ శాఖ ఆద్వర్యం లో హనుమకొండ అర్బన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రక్త దాన శిబిరం చేప‌ట్టారు. ఈ శిబిరానికి పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి ముఖ్య అతిధిగా హాజర‌య్యారు. రక్తదాతలకు పండ్లు, సర్టిఫికెట్లు అందచేశారు.

ఈ సంద‌ర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి మాట్లాడుతూ.. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటుచేశామన్నారు. రక్త దానం చేయడం ద్వారా ప్రాణాలను కాపాడిన వారు అవుతామని, ఆరోగ్యంగా ఉన్న ప్రతి వ్యక్తి రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కాజిపేట్ డివిజన్ పోలీస్ స్టేషన్స్ సిబ్బంది యువతను రక్తదానం చేసేవిదంగా ప్రోత్సహించి రక్తదానం చేసినందుకు అభినందించారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ సెంట్రల్ జోన్ డి. సి. పి: కె. పుష్పారెడ్డి, హనుమకొండ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్: డాక్టర్ పి. విజయచందర్ రెడ్డి, రెడ్ క్రాస్ రాష్ట్ర పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement