Sunday, April 28, 2024

Palakollu – టీడీపీ లో చేరిన రఘురామకృష్ణరాజు

పాలకొల్లు: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు టీడీపీ లో చేరారు. పాలకొల్లు సభలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు

.ఈ సందర్భంగా రఘురామ మాట్లాడుతూ.. చంద్రబాబు చొరవతో మళ్లీ ప్రజలముందుకొచ్చానన్నారు. చంద్రబాబు, ప్రజల రుణంతీర్చుకుంటానని చెప్పారు. జూన్‌ 4న చంద్రబాబు, పవన్‌ ప్రభంజనం సృష్టించబోతున్నారని సభలో అన్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ”ఒక సైకో పాలనలో ప్రాణాలు ఒడ్డి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడిన వ్యక్తి రఘురామ. మీ అందరి ఆమోదంతో పాలకొల్లులో ఆయన్ను మనస్ఫూర్తిగా తెదేపాలోకి ఆహ్వానిస్తున్నాం. పార్టీలో చేర్చుకొంటున్నాం. ఒక ఎంపీని తన నియోజకవర్గానికి రాకుండా చేసిన దుర్మార్గుడు ఎవరు? ఇది న్యాయమా? మీకు ఆమోద యోగ్యమా? ఏంటీ అరాచకం? ఏంటీ సైకో పాలన? గతంలో ఆయన్ను పోలీసుల కస్టడీలోకి తీసుకొని ఇష్టానుసారంగా చిత్రహింసలకు గురిచేశారు. రాష్ట్రపతి, గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లి అన్నివిధాలా ప్రయత్నిస్తే.. చివరకు కోర్టు జోక్యంతో ఆయన బయటపడ్డారు.. లేదంటే ఈరోజు ఆయన్ను మీరు చూసేవాళ్లు కాదు. అందుకే దుర్మార్గుడి పాలన నుంచి ప్రజాస్వామ్యాన్ని, పిల్లల భవిష్యత్తును కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.అందుకోసం ఇలాంటి వ్యక్తులు కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందనితెలియజేస్తూ రఘురామను మీ అందరి ఆమోదంతో తెదేపాలోకి ఆహ్వానిస్తున్నా” అని పాలకొల్లు ప్రజల సమక్షంలో చంద్రబాబు రఘురామకు పార్టీ కండువా వేసి తమ పార్టీలోకి స్వాగతం చెప్పారు

Advertisement

తాజా వార్తలు

Advertisement