Friday, May 3, 2024

Honor: పద్మ విభూషణ్‌ల‌కు ప్ర‌భుత్వం స‌న్మానం…

రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాల్లోని పలువురికి పద్మ అవార్డులు వరించాయి. పద్మ విభూషణ్ అవార్డులు వచ్చిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవిలతో పాటు పద్మ అవార్డు గ్రహీతలకు తెలంగాణ ప్రభుత్వం ఆదివారం శిల్పకళా వేదికగా సన్మానించింది.

పద్మ విభూషణ్ పురస్కారాల గ్రహీతలు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవిలతో పాటు పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య, ఆనందాచారి, కేతావత్ సోమ్ లాల్, కూరెళ్ల విఠలాచార్యకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు శాలువా కప్పి, మెమెంటోను అందజేసి సన్మానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement