Monday, May 6, 2024

అడవిమార్గాన పాదయాత్ర.. శ్రీశైలానికి తరలివెళ్తున్న భక్తులు..

శ్రీశైలక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా కొనసాగుతున్నాయి. దేవాదిదేవుడిని తనివితీరా దర్శించుకునేందుకు నల్లమల అడవి మార్గం గుండా కాలినడకన శివస్వాములు, భక్తులు లక్షలాది సంఖ్యలో తరలివస్తున్నారు. శివరాత్రి సమీపిస్తుండటంలో రాయలసీమ కోస్తా తెలంగాణ కర్ణాటక ప్రాంతాల నుంచి మహిళలు వృద్ధులు చిన్నారులు మల్లన్న ప్రభో ఆదుకో అంటూ ఆర్తితో పిలుస్తూ శ్రీగిరి కొండకు చేరుకుంటున్నారు. నల్లమల అరణ్యం గుండా కాలినడకన వస్తున్న వారికి దేవస్థానం పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించింది. దేవస్థానం అధికారులు లక్షల రూపాయలు ఖర్చుపెట్టి కాలినడకన వచ్చే భక్తులకు వైద్య సౌకర్యాలు కల్పించారు అనంతరం పాదయాత్ర భక్తుల కోసం అడవి మార్గంలో లో రాళ్లు రప్పలు లేకుండా వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రోడ్డు దరి వెంబడి ట్రాక్టర్లతో నీరు చల్లడం వచ్చే భక్తులకు మార్గమధ్యలో అన్నదాన, ప్రసాదాలు ఏర్పాటు చేశారు.

అలాగే పలువురు దాతలు మజ్జిగ, పండ్లు, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. భకుల సౌకర్యాలపై దేవస్థానం ఈవో ఎస్‌.లవన్న ప్రత్యేక దృష్టి పెట్టడం సంతోషంగా ఉందని పలువురు భక్తులు తెలిపారు. శ్రీశైలంలో ఆదివారం బ్రహ్మోత్సవాల్లో భాగంగా భ్రమరాంబ దేవి మల్లికార్జున స్వామి అమ్మవార్లకు పుష్ప పల్లకీ సేవ నిర్వహిస్తున్నట్లు- దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఎస్‌.లవన్న తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement