అమరాతి, ఆంధ్రప్రభ: ఫుడ్ ప్రాసెసింగ్లో ఎంటర్ ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్పై ఆన్లైన్ కోర్సును డిసెంబర్ 1 నుండి ప్రారంభం అవుతోందని, ఈ ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్సును ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, మహిళలు, యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సీఈవో ఎల్.శ్రీధర్ రెడ్డి కోరారు. ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫ్యాప్సీ) ఆధ్వర్యంలో ఫుడ్ ప్రాసెసింగ్లో ఎంటర్ ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ పై 10 రోజులపాటు ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్సును నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్ 1 నుండి 12వ తేదీ వరకు ప్రతి రోజూ మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తున్నామన్నారు.
ఫుడ్ ప్రాసెసింగ్లో తయారీ రంగంలో, సేవా సంస్థలు, ముఖ్యంగా ఎంఎస్ఎంఈలను స్థాపించడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మరింత లోతైన జ్ఞానాన్ని అందించడానికి ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్సును రూపొందించామన్నారు. తమ భవిష్యత్ వ్యాపార ప్రణాళికలను అవసరమైన అవగాహనతో పాటు నిపుణులతో నేరుగా చర్చించడానికి అవకాశం కల్పిస్తామన్నారు. బ్యాంకింగ్ రంగంలోని ఎంఎస్ఎంఈ విభాగానికి చెందిన నిపుణులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, ప్రాక్టీస్ చేస్తున్న లీగల్ ఇంప్లిమెంటర్లు, మార్కెటింగ్ నిపుణులు, ప్రభుత్వ అధికారులు తమ నిజ జీవిత అనుభవాలను ట్రైనీలతో పంచుకోవడంతో పాటు సలహాలు, సూచనలు ఇస్తారన్నారు.
ఈ కార్యక్రమం మార్కెట్ను గుర్తించే పద్ధతులు, ముడి పదార్థాల సేకరణ, ప్రాజెక్ట్ నివేదిక తయారీ, బ్యాంకు నుండి రుణాలు, ప్యాకేజింగ్ బ్రాండింగ్, చట్టపరమైన అంశాలు, ఫ్యాప్సీ లైసెన్స్ రిజిస్ట్రేష్రన్ సిస్టమ్, ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీలు సేవలు, ఎగుమతి అవకాశాలు, పథకాలు, విధానాలు, ప్రమాద నిర్వహణ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారన్నారు. శిక్షణ పూర్తైన తర్వాత అభ్యర్థులకు ఫ్యాప్సీ సర్టిఫికేట్ అందజేస్తామని తెలిపారు. మరిన్ని వివరాల కోసం ఫ్యాప్సీ అధికారులు ఎస్. జీవన్ 9182927627, కె.శ్రీకాంత్ శ్రీకాంత్ 9391422821 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.