Saturday, May 4, 2024

AP: కాకినాడ జిల్లాలో పేలిన ఆయిల్‌ ట్యాంకర్‌.. ఇద్దరి మృతి

ఖాళీగా ఉన్న ఆయిల్‌ ట్యాంకర్‌ పేలడంతో ఇద్దరు మృతిచెందిన ఘటన కాకినాడ జిల్లాలో చోటుచేసుకుంది. శంఖవరం మండలం కత్తిపూడి శివారుకు మరమ్మతుల కోసం దాన్ని తీసుకొచ్చారు. వెల్డింగ్‌ చేస్తుండగా ఒక్కసారిగా ట్యాంకర్‌ పేలింది.

ఈ ఘటనలో కత్తిపూడికి చెందిన కొచ్చెర్ల ప్రభాకర్‌ (38), బూరా సోమరాజు (39) మృతిచెందారు. స్థానికుల సమాచారంతో పోలీసుల ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. వేడి తీవ్రతకు ట్యాంకర్‌ పేలి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుల కుటుంబీకులు అక్కడికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement