Monday, April 29, 2024

అవుకులో క్షుద్ర పూజలు కలకలం

అవుకు రూరల్, జులై 20 (ప్రభ న్యూస్) : ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అవుకు రిజర్వాయర్ సమీపంలోని (చిన్న చెరువు) పాలేరు కొండపై గుర్తు తెలియని దుండగులు క్షుద్ర పూజలు చేయడంతో కలకలం రేపాయి. కొందరు యువకులు కొండపైకి మలవిసర్జనకు వెళ్లి గమనించడంతో ఈ విషయం బయటకు వచ్చింది. రిజర్వాయర్ సమీపంలో క్షుద్ర పూజలు చేశారన్న విషయం తెలుసుకున్న పట్టణ ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

గత మూడు రోజుల క్రితం అమావాస్య కావడంతో క్షుద్ర పూజలు చేశారన్న అనుమానాలు కలుగుతున్నాయి. క్షుద్ర పూజలు చేసిన స్థలంలో నల్లకోడిని బలి చేయడంతో పాటు పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, ఉల్లిగడ్డలు, కత్తి, కోడిగుడ్డు, పెరుగు వంటి వస్తువులను ఉంచి క్షుద్రపూజలు చేశారు. ఎవరు చేశారు, ఎందుకోసం చేశారన్నది తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement