Sunday, April 28, 2024

Adb | భైంసాలో కత్తి పోట్ల కలకలం.. యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి

నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో కత్తిపోట్ల కలకలం చెలరేగింది. బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. పట్టణంలోని గోపాల్ నగర్ కాలనీకి చెందిన తోట శంకర్ (30)పై అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. అర్ధరాత్రి వేళ సదరు వ్యక్తి బైక్ పై గోపాల్ నగర్ కాలనీకు వచ్చి తోట శంకర్ ను బయటకు పిలిచినట్లుగా సమాచారం. నిద్ర నుంచి మేల్కొని ఇంటి తలుపు తీసుకొని బయటకు వచ్చిన యువకునిపై సదరు వ్యక్తి కత్తితో విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డట్లుగా తెలిసింది.

ఇక.. బాదితుడు అరుపులు కేకలు వేయడంతో సమీప నివాస గృహాల వారు యువకుని ఇంటి వద్దకు పరుగున వచ్చారు. దీంతో దాడికి పాల్పడ్డ వ్యక్తి తాను తీసుకవచ్చిన బైక్ ను అక్కడే వదిలి పారిపోయినట్లుగా తెలుస్తోంది. కత్తిపోట్ల బారిన పడి తీవ్ర గాయాలపాలైన తోట శంకర్ ను కాలనీకి వాసులు హుటహూటిన స్థానిక ఏరియా అసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ఆసుపత్రి కి తరలించినట్లుగా తెలిసింది. ఈ సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి బైకు ను స్వాధీన పరచుకున్నారు. నిందితుడు ఎవరన్న దానిపై ఆరా తీస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement