Tuesday, May 14, 2024

జ‌గ‌న్ వి న‌వ‌ర‌త్నాలు కాదు.. న‌వ మోసాలు.. చంద్ర‌బాబు

జ‌గ‌న్ వి న‌వ‌ర‌త్నాలు కాద‌ని, న‌వ మోసాలు అని ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. దళిత నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ ఫొటో ఉండాల్సింది ఇంటి తలుపులపై కాదన్న చంద్రబాబు పోలీస్ స్టేషన్ లో ఉండాలని మండిపడ్డారు. ప్రత్యేకంగా ఎస్సీల కోసం ఒక్క బటన్ అయినా జగన్ నొక్కారా అని ప్రశ్నించారు.

సీఎం జ‌గ‌న్ ప్రభుత్వ సలహాదారులుగా దళితులను ఎందుకు నియమించలేదో చెప్పాలన్నారు. వీపీలుగా దళితులు పనికిరారా అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో దళితద్రోహి జగన్ అనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని తెలిపారు. ఉద్యోగాల్లో, ప్రమోషన్లలో దళితులకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. కేఆర్ నారాయణన్‌ను రాష్ట్రపతి చేసిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు. జీఎంసీ బాలయోగిని లోక్‌సభ స్పీకర్‌ను చేశామని చంద్రబాబు గుర్తు చేశారు. నేషనల్ ఫ్రంట్‌గా ఉన్నప్పుడు అంబేడ్కర్‌కు భారతరత్న ఇప్పించిన ఘనత టీడీపీకే దక్కిందని చంద్రబాబు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement