Sunday, May 5, 2024

వాటిని న‌మ్మ‌కండి

సూపర్‌స్టార్‌ మహేష్‌, దర్శకుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌ సినిమాపై అభిమానులు ఆసక్తితో ఉన్నా రు. అయితే ఈ సినిమా గురించి సామాజిక మాధ్య మాల్లో రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. అభిమా నులకు ఆందోళన కలిగిస్తున్న ఈ విషయాలపై నిర్మాత నాగవంశీ స్పష్టత ఇచ్చారు. రూమర్స్‌కు చెక్‌ పెట్టారు. ఆయన సోషల్‌ మీడియాలో స్పందించారు. ”ఇలాంటి వార్తలు చూసి నవ్వుకోవడమే తప్పచేసేదేమి లేదని’ అ న్నారు. వీటిని పట్టించుకోకూడదని మహేష్‌ అభిమా నులకు సూచించారు. వచ్చే ఏడాది మహేష్‌ సినిమా ప్రేక్షకుల ముందుకువస్తుందని హామీ ఇచ్చారు.
పూజాహెగ్డే, శ్రీలీల నటిస్తున్న ఈ చిత్రాన్ని హారిక హాసినీ సంస్థ అధినేత ఎస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్నా రు.తొలుత ప్రకటించిన విధంగా వచ్చే ఏడాది సం క్రాంతికి విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్రయత్నిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement