Sunday, May 19, 2024

సిఎస్, డిజిపిల‌కు నిమ్మ‌గ‌డ్డ ప్ర‌శంస ….

అమరావతి: ఏపీ సీఎస్ ఆధిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్ గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో భేటీ అయ్యారు. తొలిదశ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినందుకు అభినందనలు తెలిపారు. తొలిదశ ఎన్నికలు పూర్తికాగా మరో మూడు దశల ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏర్పాట్లపై కూడా భేటీలో చర్చ జరిగింది. ఎన్నికల ఏర్పాట్లు, భద్రతా అంశాలతోపాటు ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై కూడా చర్చ జరిగింది. మిగిలిన ద‌శ‌ల పోలింగ్ కు ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌త ఏర్పాటు చేయాల‌ని కోరారు నిమ్మ‌గ‌డ్డ‌..

Advertisement

తాజా వార్తలు

Advertisement