Monday, April 29, 2024

Palnadu: న‌వ‌వ‌ధువు సూసైడ్‌.. ఉరేసుకొని బ‌ల‌వ‌న్మ‌ర‌ణం

పల్నాడు జిల్లా రామిరెడ్డిపేటలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి చేసుకొని కోటి ఆశలతో ఓ నవ వధువు అత్తింట్లో అడుగుపెట్టింది. తన భర్తతో వందేళ్ల జీవితాన్ని ఊహించుకుంది. అంతలో ఏమైందో తెలియదు కానీ.. ఉన్నట్లుండి ఆత్మహత్యకు పాల్పడింది.

రామిరెడ్డిపేటలో ఇంట్లో ఉరివేసుకొని నవవధువు శిల్పబలవన్మరణానికి పాల్పడింది. భర్త వెంకటేష్ మృతురాలి త‌ల్లిదండ్రుల‌కు ఫోన్ చేసి మీ అమ్మాయి చనిపోయిందని చెప్పడంతో శిల్పా తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. భర్త వెంకటేష్‌పై మృతురాలి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement