Sunday, April 28, 2024

గ్రామ సచివాలయాల సందర్శన.. ప్రజలతో మమేకం అవుతున్నాం: కాకాణి

ముత్తుకూరు (ప్రభ న్యూస్) : గ్రామ సచివాలయాల సందర్శనతో ప్రజలతో మమేకమం అవుతున్నామని ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని ముసునూరువారిపాలెం, పైనంపురం గ్రామపంచాయతీల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, మేళ తాళాలు, కర్పూర హారతులు మధ్య మంత్రికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. గడపగడపలో మంత్రి ప్రజల స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మీడియాతో మంత్రి కాకాణి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక పథకాలు ప్రజల కోసం అమలు చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో పంచాయతీలపాలక వర్గంతో పాటు జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మునుకూరు రవికుమార్ రెడ్డి, ఆయా పంచాయతీల సర్పంచులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement