ఓ రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా మరో నలుగురికి గాయాలైన ఘటన ఏపీలోని నెల్లూరు జిల్లా కావలి గ్రామీణం అలిగుంటపాలెం క్రాస్రోడ్డు వద్ద జరిగింది. నెల్లూరు నుంచి ఒంగోలు వెళ్తుండగా డివైడర్ను ఢీకొని కారు టైర్పేలి పంట కాల్వల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో నలుగురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement