Friday, April 26, 2024

పాలేరు వాగులో విద్యార్థి గల్లంతు..

మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పాలేరు వాగులో పడి ఓ విద్యార్థి గల్లంతయ్యాడు. ఈ విషాదకర సంఘటన దంతాలపల్లి మండలం పెద్దముప్పారంలో చోటు చేసుకుంది. వెంటనే స్థానికులు అక్కడకు చేరుకుని విద్యార్థి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిన్న స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన విద్యార్థి ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోయాడు. గల్లంతైన విషయాన్ని దాచిపెట్టి స్నేహితులు ఎరుగనట్టు ఇంటికి వెళ్లారు. విద్యార్థి తల్లిదండ్రులు నిలదీయటంతో గల్లంతైన విషయాన్ని స్నేహితులు బయటపెట్టారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement