Friday, May 3, 2024

సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడండి : త‌హ‌సీల్దార్ సురేష్ బాబు

ముత్తుకూరు ఏప్రిల్ 10 (ప్రభ న్యూస్) : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడాలని మండల త‌హ‌సీల్దార్ ఏ.సురేష్ బాబు అన్నారు. నూతన త‌హ‌సిల్దార్ గా ఆయన పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా సోమవారం పంచాయతీరాజ్ శాఖ గ్రామ సచివాలయాల డీడీవోలు చక్రం వెంకటేశ్వర్లు, వాసుదేవరావు, రాజశేఖర్, మల్లికార్జున్, మరి కొంతమంది ఆయన చాంబర్ నందు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ నేపథ్యంలో త‌హ‌సీల్దార్ గ్రామ సచివాలయాల డీడీవోల‌కు పలు విషయాలపై సూచనలు ఇచ్చారు. పంచాయతీ పరంగా ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకువస్తే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ద్వారా పరిష్కారం చేస్తామని త‌హ‌సీల్దార్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement