Saturday, April 27, 2024

ప్రైవేట్ టీచ‌ర్ ఆత్మ‌హ‌త్య‌..

ముత్తుకూరు ఏప్రిల్ 17 (ప్రభ న్యూస్) : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో దారుణం చోటుచేసుకుంది. మండ‌లంలోని పంటపాలెం గ్రామపంచాయతీ కోళ్ల మిట్ట గ్రామంలో ఓ అపార్ట్ మెంట్ లో ప్రైవేట్ స్కూల్ టీచర్ బి.రజిత (36) ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. సోమవారం ఎస్సై శివ కృష్ణారెడ్డి తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. జిల్లాలోని కొండలూరు మండలం కమ్మపాలెం గ్రామానికి చెందిన వెంకట హరితో 13 ఏళ్ల కింద‌ట వివాహం జ‌రిగింది. కుటుంబ కలహాల కారణంగా భర్తకు దూరంగా ఉంటూ ప్రైవేట్ స్కూల్ నందు టీచర్ గా పని చేస్తూ పిల్లలను పోషించుకుంటుంది. పిల్లలకు భోజనం పెట్టి బెడ్ రూమ్ కి వెళ్లి తాళం వేసుకుంది. తల్లి కోసం పిల్లలు తలుపు తట్టినా బయటకు రాకపోవడంతో పక్కవారి సాయంతో కిటికీలోంచి చూడగా ర‌జిత‌ ఫ్యానుకు ఉరి వేసుకుని ఉంది. వెంట‌నే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై శివ కృష్ణారెడ్డి సంఘటనా స్థ‌లానికి చేరుకుని వివరాలు సేక‌రించారు. అనంత‌రం మృత‌దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్ప‌త్రికి తరలించారు. ఈ మేర‌కు పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement