Wednesday, May 1, 2024

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ద్విచక్ర వాహనం పై వస్తూ అనారోగ్యానికి గురై రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన బుచ్చిరెడ్డిపాలెం మండలం రేపాల ముంబై రోడ్ లో శనివారం చోటుచేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బుచ్చిరెడ్డిపాలెం లో చిల్లర అంగడి నలుపుకుంటున్న దర్శి హరి నారాయణ(56) నెల్లూరులో పనులు ముగించుకొని బుచ్చికి వచ్చే క్రమంలో రేపాల వద్ద ముంబై రహదారిపై అకస్మాత్తుగా అదుపుతప్పి కింద పడిపోయాడు. హెల్మెట్ ఉన్నప్పటికీ కింద పడ్డ సమయంలో రాయికి తల తగలడంతో బలమైన గాయమై మృతి చెందాడు. హార్ట్ ఎటాక్ రావడంతో కింద పడిపోయి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. బుచ్చిరెడ్డిపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement