Thursday, April 25, 2024

అంతిమ తీర్పు ఎవ‌రిది..

సాయి ధన్సిక, అమిత్‌ తివారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అంతిమ తీర్పు’. ఏ.అభిరాం దర్శకుడు. డి. రాజేశ్వరరావు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర బృందం -టైటిల్‌ ఆవిష్కరిస్తూ మీడియా సమావేశం నిర్వహించింది. నటుడు అమిత్‌ తివారి మాట్లాడుతూ ”ఒక మంచి సినిమా తియ్యాలి అనే తపన నిర్మాతలో కనిపించింది.” అన్నారు.
నటి సాయి ధన్సిక మాట్లాడుతూ ”ఈ సినిమాలో అందరు మంచి పాత్రల్లో కనిపిస్తారు. మంచి కథతో మీ ముందుకు వస్తు న్నాం.” అన్నారు.దర్శకుడు అభిరాం మాట్లాడుతూ ఈ సినిమా కథ నం ఒక గ్రామీణ నేపథ్యంలో జరుగుతుంది. సాయి ధన్సిక అద్భు తంగా చేసింది. కోటి గారు మంచి ట్యూన్స్‌ ఇచ్చారు. నిర్మాత డి. రాజేశ్వరరావు గారు మంచి సపోర్ట్‌ చేసారు. అని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement