Thursday, May 2, 2024

వడదెబ్బకు.. వృద్ధురాలు మృతి

చేజర్ల (ప్రభ న్యూస్): భగ భగ మండుతున్న ఎండల దాటికి వడదెబ్బ తగిలి వృద్ధురాలు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని బోడిపాడు గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం గ్రామానికి చెందిన బోయిళ్ళ ఓబులమ్మ (80) అనే వృద్ధురాలు మండుతున్న ఎండల వేడిమి తాళలేక తీవ్రఅస్వస్థతకు గురై మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ బలరామిరెడ్డి వృద్ధురాలి మృతదేహాన్ని పరిశీలించి నివాళులర్పించారు. అప్పటిదాకా ఆరోగ్యంగా ఉన్న ఓబులమ్మ ఒక్కసారిగా వడదెబ్బ తగిలి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఎండల తీవ్రత అధికంగా ఉండడం వల్ల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement