Wednesday, May 1, 2024

వైభవంగా శివపార్వతుల కళ్యాణం

వరికుంటపాడు : వరికుంటపాడు మండల పరిధిలోని పెద్దిరెడ్డిపల్లి గ్రామంలో వెలసి ఉన్నటువంటి శ్రీ త్రిపురేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చినటువంటి భక్తులకు ఆలయ అర్చకులు ఆనంద శర్మ గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం శివనామ స్మరణలతో మారుమోగింది.

అనంతరం శివపార్వతుల కళ్యాణాన్ని ఆలయ ధర్మకర్తలు పెండ్యాల సూర్యనారాయణ, అమ్మాజీ దంపతులు దగ్గరుండి శివపార్వతుల కళ్యాణాన్ని వేదమంత్రాలు భాజా భజంత్రీల నడుమ శాస్త్రోక్తంగా కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ కళ్యాణాన్ని తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారి కృప కటాక్షాలను పొందారు. అనంతరం ఆలయం వద్దకు వచ్చినటువంటి భక్తులందరికి మధ్యాహ్నం అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. సూర్యనారాయణ వచ్చిన భక్తులకు దగ్గరుండి భోజనాలను వడ్డించారు. సాయంత్రం శివపార్వతులను గ్రామంలోని పురవీధుల్లో బాణాసంచా పేలుస్తూ ఊరేగింపుగా భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయాన్ని పలు రకాల విద్యుత్ దీపాలంకరణలతో సుందరంగా తీర్చిదిద్దారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement