Tuesday, April 16, 2024

Breaking: చంద్రబాబుపై కేసు నమోదు

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబుపై కేసు నమోదైంది. రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలులో చంద్రబాబుపై కేసు నమోదైంది. చంద్రబాబుతో పాటు మరో ఏడుగురు టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. డీఎస్పీ భక్తవత్సలం ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్ షో నిర్వహించి పోలీసులను దూషించారని డీఎస్పీ ఫిర్యాదు చేశారు. 143, 353, 149, 188 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement