Saturday, May 4, 2024

డాక్టర్ జీవీబీమురళీకృష్ణ కు జ్యోతిషవైభవ కేసరి పురస్కారం.

ముత్తుకూరు (ప్రభ న్యూస్) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ జ్యోతిష శిరోమణి, జ్యోతిష సాగర పురస్కార గ్రహీత డాక్టర్ జీవీబీ మురళీకృష్ణ ఆదివారం జ్యోతిష వైభవ కేసరి పురస్కారం పొందారు. సికింద్రాబాద్ లోని హరిహర కళా భవన్ లో స్వర్ణ కంకణ సన్మాన కార్యక్రమం జరిగింది. హైదరాబాద్ కు చెందిన లలిత కళా సమైక్య ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా దేశంలోని తొమ్మిది రాష్ట్రాల నుండి వివిధ రంగాలలో సేవలందిస్తున్న 135 మంది హాజరయ్యారు. స్వాతంత్రోత్సవ సంబరాల్లో భాగంగా లలిత కళా సమాఖ్య నిర్వహించిన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రముఖులు విచ్చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement