Sunday, April 28, 2024

వైభవం.. సీతారాముల కల్యాణం

వరికుంటపాడు : వరికుంటపాడు మండలం పరిధిలోని ఆండ్రావారిపల్లి గ్రామంలో సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివార్లకు ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కుంకుమార్చన పుణ్యాహ వాచనము, సహస్ర దీపాలంకరణ తదితర ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి కల్యాణాన్ని వందలాది మంది భక్తుల నడుమ వేద పండితులు ఘనంగా నిర్వహించారు. ఈ కల్యాణాన్ని తిలకించేందుకు గ్రామంలోని పెద్దలు పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారి ప్రసాదాలను పంచిపెట్టి స్వామివార్లను గ్రామంలోని పుర వీధులలో ఊరేగింపుగా భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement