Sunday, April 28, 2024

క‌ర్మాగారంలో గ్యాస్ లీక్‌.. ఐదుగురు కూలీల‌కు అస్వ‌స్థ‌త‌

క‌ర్మాగారంలో గ్యాస్ లీకై ఐదురుగు కూలీలు అస్వ‌స్థ‌త‌కు గురైన ఘ‌ట‌న నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. పంటపాలెం పంచాయతీలోని ఓ కర్మాగారంలో బిహార్‌కు చెందిన కార్మికుడు బాయిలర్ సమీపంలోని బావిలో దిగి పనులు పరిశీలిస్తుండగా గ్యాస్‌ లీకై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.

ఇది గ‌మ‌నించిన మ‌రో న‌లుగురు కార్మికులు వ్య‌క్తిని కాపాడేందుకు బావిలో దిగి అస్వస్థతకు గురయ్యారు. మొత్తం ఐదుగురు కార్మికులు అస్వ‌స్థ‌త‌కు గురికాగా.. వెంటనే స్పంధించిన సహచర కార్మికులు బాధితులను నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. వారిని పరీక్షించిన వైద్యులు ప్రాణాపాయం లేదని ప్రకటించారు. సంఘటనపై విచారణ చేస్తున్నామని, ఎవరికి ఎలాంటి ప్రాణహాని లేదని ఎస్సై శివరామకృష్ణ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement