Thursday, May 2, 2024

NLR: విద్యుత్ షాక్‌తో రైతు దుర్మ‌ర‌ణ‌

ముత్తుకూరు, డిసెంబర్ 26 (ప్రభ న్యూస్): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు గ్రామపంచాయతీ పరిధి బలిజ పాలెం గ్రామం నందు విద్యుత్ షాక్ తో ఓ రైతు దుర్మరణం చెందిన సంఘటన మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ గ్రామానికి చెందిన రైతు నాటారి నాంచారులు(26) మాగాణి పొలంలో ట్రాక్టర్ తో దుక్కి దున్నుతూ ఉండగా ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రమాదం జరిగింది. పొలంలో వేలాడుతున్న కరెంటు వైర్లకు ట్రాక్టర్ పొగ గొట్టం తగిలి వైర్లు తెగిపోవడం జరిగింది. దీంతో మృతుడు నాటారి ట్రాక్టర్ దిగి తెగిన కరెంటు వైర్ ను పట్టుకోగా సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. విద్యుత్ షాక్ తో రైతు మృతి చెందగా ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. చుట్టుపక్కల రైతులు ఈ సంఘటన చూసి మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చారు. మృతుడుకు ఇంకా వివాహం కాలేదు. ప్రభుత్వ అధికారులు సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు నమోదు చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement