Monday, April 29, 2024

Congress: తెలంగాణ‌లో లోక్ స‌భ ఎన్నిక‌ల‌లోనూ మెజార్టీ స్థానాలు మావేః దీపాదాస్ మున్షీ

డిల్లీ – అసెంబ్లీ ఎన్నికల విజ‌య ఉత్సాహంతో తెలంగాణలో మెజార్టీ ఎంపీ స్థానాలు గెలుపు సాధిస్తామని చెప్పారు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల కొత్త ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ. ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, గ‌తం కంటే తెలంగాణాలో ఎక్కువ స్థానాలు గెలుస్తామ‌ని చెప్పారు.

బీజేపీ, బీఆర్ఎస్, మజ్లిస్ ఈ మూడు పార్టీలు పరోక్షంగా కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ కాంగ్రెస్‌లో కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు అన్ని విషయాలపైనా తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. జనవరి మొదటి వారంలో తాను తెలంగాణకు వెళతానన్నారు. ఎమ్మెల్యేలుగా ఓడిన సీనియర్ల సేవలను కూడా పార్టీ, ప్రభుత్వం ఉపయోగించుకునే విషయంపై పార్టీలో చర్చిస్తానన్నారు. కాగా, కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం కోరుకోవడం మంచి పరిణామమని అన్నారు. ఈసారి సోనియా ఎక్కడి నుంచి పోటీ చేస్తారో ఇంకా తెలియదని పేర్కొన్నారు. అయితే గాంధీ కుటుంబం నుంచి ఎవరైనా తెలంగాణ నుంచి పోటీ చేస్తే అది పార్టీకి ఉపయోగపడుతుందని, తెలంగాణాలోని మొత్తం 17 లోక్ స‌భ స్థానాల‌ను త‌మ పార్టీ గెలుచుకునే అవ‌కాశాలు మ‌రింత మెరుగ‌వుతాయ‌ని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement