Thursday, May 2, 2024

రోడ్డు ప్రమాదంలో ఉత్తరప్రదేశ్ కు చెందిన యువకుడు మృతి

బుచ్చిరెడ్డిపాలెం ఫిబ్రవరి 24 ప్రభ న్యూస్ – ద్విచక్ర వాహనంలో వెళుతూ రోడ్డు ప్రమాదానికి గురై ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ యువకుడు మృతి చెందిన సంఘటన బుచ్చిరెడ్డిపాలెం లో గురువారం రాత్రి చోటుచేసుకుంది. బుచ్చిరెడ్డిపాలెం పోలీసులు ఎస్సై వీర ప్రతాప్ శుక్రవారం సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల కథనం మేరకు వివరాల్లో ఉన్నాయి ఉత్తరప్రదేశ్లోని గూండా జిల్లాకు చెందిన జీవన్ అతని స్నేహితుడు ముఖేష్లు కూలి పనులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై నెల్లూరు వెళ్లే క్రమంలో చెల్లాయి పాలెం పంచాయితీ కానుగ చెట్ల సెంటర్ వద్ద అదుపుతప్పి పక్కనే ఉన్న స్తంభాన్ని వేగంగా ఢీకొట్టారు. ఢీ కొట్టిన వెంటనే ఇద్దరు పక్కనే ఉన్న పొదల్లో పడిపోయారు. ఆలస్యంగా గుర్తించిన కొందరు పోలీసులు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకొని బాధితుల వివరాలను నమోదు చేశారు. తీవ్ర గాయాలు పాలైన ముఖేష్ ను మెరుగైన చికిత్స కోసం నెల్లూరు తరలించారు. మృతి చెందిన జీవన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement