Thursday, May 9, 2024

మారుతి న‌గ‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యంలో.. హీరోగా రావు ర‌మేశ్

మారుతి న‌గ‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యం చిత్రంతో హీరోగా ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు న‌టుడు రావు ర‌మేశ్. ఈయ‌న‌కి జోడీగా న‌టి ఇంద్ర‌జ న‌టించ‌నుంది. తనదైన స్టైల్‌లో డైలాగ్స్‌ చెబుతూ ఆడియెన్స్ ను ఎంటర్‌టైన్‌ చేయడం రావు ర‌మేశ్ కి ఉన్న ప్రత్యేకత. ఇప్పటివరకు క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా సిల్వర్‌ స్క్రీన్‌పై మెరిసిన రావు రమేశ్.. ఈ సారి హీరోగా మెరువబోతున్నారు . ఈ విలక్షణ నటుడు హీరోగా నటిస్తున్న చిత్రానికి మారుతి నగర్‌ సుబ్రహ్మణ్యం టైటిల్‌ ఖరారు చేశారు. లక్ష్మణ్‌ కార్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. కాన్సెప్ట్‌ ఓరియెంటెడ్‌ స్టోరీతో రాబోతున్న ఈ చిత్రంలో రావు రమేశ్ మెయిన్ లీడ్‌ రోల్‌లో కనిపించబోతున్నారు. మార్చి నుంచి మారుతి నగర్‌ సుబ్రహ్మణ్యం రెగ్యులర్‌ షూటింగ్ షురూ కానుంది. పీబీఆర్‌ సినిమాస్‌ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ బ్యానర్‌లో వస్తున్న రెండో చిత్రమిది.

Advertisement

తాజా వార్తలు

Advertisement