Monday, April 29, 2024

అరెస్టులు.. దాడులతో భయపడం : టీడీపీ నేత కేశవ చౌదరి

చేజర్ల : రాష్ట్ర ప్రజల్లో లభిస్తున్న ఆదరణను ఓర్వలేక రానున్న ఎన్నికల్లో తమ ఓటమి తప్పదని ఆక్రోషంతో వైసిపి ప్రభుత్వంతో పాటు నాయకులు సైకోల్ల ప్రవర్తిస్తున్నారని నాగుల వెల్లటూరు గ్రామ అభివృద్ధి ప్రదాత తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వేలూరు కేశవ చౌదరి వైసీపీ ప్రభుత్వం పై ఘాటు విమర్శలు చేశారు. ఆయన బుధవారం మీడియా తో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ శ్రేణులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా వల్లభనేని వంశీ వర్గీయులు దాడులకు పాల్పడితే.. తెలుగుదేశం పార్టీకి చెందిన పట్టాభిని అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇటువంటి దుర్మార్గపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రానికి అభివృద్ధి లేకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్న తీరుకు గన్నవరం దాడులే నిదర్శనమన్నారు. వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న ఇటువంటి దాడులవల్ల గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడు తుందని ఎద్దేవా చేశారు. లోకేష్ పాదయాత్ర కి వస్తున్న జనాదరణ చూసి ఓర్వలేక వైసీపీ ప్రభుత్వం రాష్ట్రమంతా కూడా ఇటువంటి చర్యలకు పాల్పడుతుందన్నారు అంతేకాకుండా శాంతిభద్రతల పరిరక్షణను కాపాడాల్సిన పోలీసులు కూడా వైసీపీ నాయకులకు సహకరించడం సిగ్గుచేటన్నారు.రానున్న ఎన్నికలలో ఓటు అనే ఆయుధంతో వైసీపీ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని కేశవ చౌదరి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ షేక్ మస్తాన్ ఆయన అనుచర వర్గం పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement