Monday, April 29, 2024

వివేకా హత్య వెనుక ఉన్నది ఎవరు?: ఒపీనియన్ పోల్ పెట్టాలన్న లోకేష్

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య వెనుక ఉన్నది ఎవరు ? అని టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. బాబాయ్ పై గొడ్డలిపోటుని గుండెపోటు అని శవరాజకీయం చేసింది జగన్ రెడ్డిఅని ఆరోపించారు. ఇప్పుడు కల్తీ సారా మరణాలను సహజ మరణాలు అంటున్నారని మండిపడ్డారు. కల్తీసారా మరణాలపై శాసన మండలిలో ప్రభుత్వం చర్చకు రాకుండా పారిపోయిందని విమర్శించారు. శవరాజకీయాలకు జగన్ రెడ్డి బ్రాoడ్ అంబాసిడర్ అని వ్యాఖ్యానించారు. తండ్రి శవం దొరక్కముందే సీఎం సీటు కోసం సంతకాలు సేకరణ చేపట్టిన వ్యక్తి జగన్ రెడ్డి అని పేర్కొన్నారు. మనకు తెలిసి కల్తీ సారాతో చనిపోయింది 25మందే,  తెలియకుండా రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయిన వారి సంఖ్య తేలాలి అని అన్నారు. మరణాలపై చర్చ చేపట్టకుండా ప్రభుత్వం ఇచ్చే ప్రకటన విని వెళ్లిపోవాలంటే ఎలా? అని ప్రశ్నించారు. వివేకాకి హత్య చేయించింది అబ్బాయి అని తేలిపోయిందని, ఇక తేలాల్సింది ఏ అబ్బాయ్ అని అని పేర్కొన్నారు. వివేకా హత్య పై ఒపీనియన్ పోల్ పెడితే ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుస్తుందన్నారు.

వివేకా హత్య వెనుక ఉన్నది ఎవరు?

A) అవినాష్ రెడ్డి

B) జగన్ రెడ్డి

C) భారతీ రెడ్డి

- Advertisement -

D) పైన ఉన్న వారందరూ.. అని పోల్ పెడితే ప్రజలే తేల్చేస్తారని లోకేష్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement