Thursday, May 2, 2024

సీఎంకు రఘురామ లేఖాస్త్రాలు.. ఉద్యోగుల డీఏ, పీఆర్సీపై నిలదీత

ఏపీ సీఎం వైఎస్ జగన్ కు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు మరో లేఖ రాశారు. ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌ డీఏ, పీఆర్సీ వెంటనే ఇవ్వాలని లేఖలో డిమాండ్ చేశారు. డీఏ, పీఆర్సీ హామీలపై ఉద్యోగుల నుంచి మద్దతు లభించిందని రఘురామ గుర్తు చేశారు. ఎన్నికల్లో ఉద్యోగులు పెద్దఎత్తున వైసీపీకి అండగా నిలిచారని పేర్కొన్నారు. ఉద్యోగులకు బకాయిలు పడ్డ ఏడు డీఏలు వెంటనే అమలు చేయాలని ఆ లేఖలో రాశారు. కరోనా కారణంగా డీఏ పెంపు వాయిదా వేసిన కేంద్రప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తే అది ఉద్యోగుల్లో వ్యతిరేకతకు దారితీస్తుందన్నారు. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం వల్ల పీఆర్సీ నివేదిక మరింత ఆలస్యమవుతుందని, పార్టీ అధికారంలోకి రావడానికి మూలస్తంభంగా నిలిచిన ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపుపై వెంటనే ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సీఎంకు రఘురామ లేఖలో కోరారు.

ఇది కూడా చదవండి: నంబర్ 5‌: అగ్రిగోల్డ్ బాధితుల‌ను ఆదుకోవాల ని సీఎం జగన్ కి RRR లేఖ

Advertisement

తాజా వార్తలు

Advertisement