Monday, April 29, 2024

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో.. ఎంపీ మాగుంట కుమారుడు అరెస్ట్

ప్రకాశం : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ రెడ్డి ని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఏపిలో తొలి అరెస్ట్ తో కావడంతో కలకలం రేపుతోంది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మాగుంట కుటుంబానికి సంబంధం లేదని మాగుంట చెప్పినప్పటికీ…ఇప్పుడు ఆయన కుమారుడిని అరెస్టు చేయడం సంచలంగా మారింది. దీంతో ఎంపీ మగుంట శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు పర్యటనను రద్దు చేసుకున్నారు. మధ్యాహ్నం రాఘవరెడ్డి ని ఈడీ అధికారులు కోర్టులో హాజరుపరచనున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement