Tuesday, May 7, 2024

AP: జ‌గ‌న్ స‌మ‌క్షంలో సొంత గూటికి చేరిన ఎమ్మ‌ల్యే ఆర్కే..

గుంటూరు: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైఎస్సార్‌సీపీ గూటికి చేరారు. మంగళవారం మధ్యాహ్నం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారాయన. సీఎం జగన్‌ కండువా కప్పి ఆర్కేను పార్టీకి ఆహ్వానించారు. గత డిసెంబర్‌లో వ్యక్తిగత కారణాల పేరిట వైఎస్సార్‌సీపీకి, మంగళగిరి ఎమ్మెల్యే పదవికి ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు.

అయితే ఆ సమయంలో ఆయన రాజీనామాపై స్పీకర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈలోపు ఆర్కే కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అయితే నెల వ్యవధి కాకముందే తిరిగి సొంత గూటికి చేరాలని ఆయన నిర్ణయించుకోవడం విశేషం. ఇదిలా ఉంటే సామాజిక సమీకరణాల్లో భాగంగా మంగళగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా గంజి చిరంజీవిని వైఎస్సార్‌సీపీ అధిష్టానం నియమించింది. ఈ నేప‌ధ్యంలో తిరిగి పార్టీలోకి వ‌చ్చిన ఆర్కేకు నియోజకవర్గంలో గెలుపు బాధ్యతలను జ‌గ‌న్ అప్పగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement