Tuesday, April 30, 2024

Breaking: జగన్ ప్రభుత్వంపై.. ఎమ్మెల్యే ఆనం హాట్ కామెంట్స్

జగన్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. వాలంటీర్లు, సచివాలయ కన్వీనర్ల మీటింగ్ లో ఎమ్మెల్యే ఆనం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రోడ్లపై గోతులు కూడా పూడ్చలేకపోతున్నామన్నారు. తాగడానికి నీళ్లు అడిగితే కేంద్ర నిధులు వచ్చేవరకు ఆగమని చెబుతున్నారన్నారు. కేంద్రం నిధులు ఇస్తే మీరేం చేస్తున్నారని ప్రజలు అడుగుతున్నారన్నారు. కేంద్రం నిధులు ఇస్తే మనం ఏం చేస్తున్నామని అన్నారు. ఈ నాలుగేళ్లలో ఏం పని చేశామని ఓట్లడుగుతామని అన్నారు. పెన్షన్లు ఇస్తే ఓట్లు పడతాయా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వమూ పెన్షన్లు ఇచ్చిందన్నారు. లే ఔట్లు వేశాం.. ఇళ్లేమన్నా కట్టామా అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement