Friday, April 26, 2024

స్వ‌ల్ప న‌ష్టాల‌తో ముగిసిన.. స్టాక్ మార్కెట్లు

స్వ‌ల్ప న‌ష్టాల‌తో ముగిశాయి నేటి స్టాక్ మార్కెట్లు. ఆద్యంతం లాభనష్టాల మధ్య మార్కెట్లు కొనసాగాయి. అంతర్జాతీయంగా మిశ్రమ ఫలితాలు ఉండటం, మళ్లీ కరోనా భయాలు మొదలు కావడం వంటి పరిణామాలతో మదుపరులు సరైన నిర్ణయం తీసుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 17 పాయింట్లు కోల్పోయి 60,910కి పడిపోయింది. నిఫ్టీ 9 పాయింట్లు పతనమై 18,122 వద్ద స్థిరపడింది. టైటాన్ (2.74%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.81%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.39%), మారుతి (1.27%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (0.98%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. భారతి ఎయిర్ టెల్ (-1.39%), యాక్సిస్ బ్యాంక్ (-1.10%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.08%), టాటా స్టీల్ (-1.08%), అల్ట్రాటెక్ సిమెంట్ (-0.87%) టాప్ లూజర్స్ గా మిగిలాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement