Thursday, April 25, 2024

ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలి : మంత్రి జయరాం

ఆలూరు : ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలని సచివాలయ కన్వీనర్లు, గ్రామ వాలంటీర్లకు రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి గుమ్మనుర్ జయరాం సూచించారు. బుధ‌వారం మంత్రి క్యాంప్ కార్యాలయంలో దేవరగట్టు ఆలయ కమిటీ చైర్మెన్ శ్రీనివాసులు, ఇంచార్జ్ నారాయణస్వామి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. సచివాలయ కన్వీనర్లు, గ్రామ వాలంటీర్లతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి జ‌య‌రాం మాట్లాడుతూ.. పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేసినప్పుడే పార్టీకి గుర్తింపు వస్తుందని తెలిపారు. పార్టీ ప్రతిష్టాత్మకంగా ఈ వ్యవస్థను తీసుకురావడం జరిగింది అని తెలిపారు. అలాగే హోలగుంద, చిప్పగిరి, హాలహర్వి మండలాల వైఎస్సార్సీపీ ఎంపీపీలు, జడ్పిటిసిలు, సర్పంచులు, ఎంపీటీసీలు, మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఇతరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement