Sunday, April 28, 2024

Srisailam – మల్లన్న సన్నిధిలో చంద్రబాబు దంపతులు

ఆంధ్రప్రభ, శ్రీశైలం: శ్రీశైల మహా క్షేత్రంలోని శ్రీ భ్రమరాంబ దేవి మల్లికార్జున స్వామి దంపతులను సోమవారం టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, భువనేశ్వరి దర్శించుకున్నారు. శ్రీశైలంలో ఆది దంపతులను దర్శించుకునేందుకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో సుండిపెంటకు చేరుకున్నారు. సుండిపెంట హైలిప్యాడ్ నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో రోడ్డు మార్గంలో వారు శ్రీసాక్షిగణపతిస్వామిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీశైలం చేరుకున్నారు. వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు జరిపారు.

ఆ తర్వాత శ్రీశైలం ఆలయ రాజగోపురానికి చేరుకున్న చంద్రబాబు, భువనేశ్వరికి ఆలయ మర్యాదలతో వేద పండితులుస్వాగతం పలికారు. అనంతరం ద్వాజ‌స్తంభానికి నమస్కరించి శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి దంపతులను దర్శించుకుని మల్లికార్జునస్వామికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దర్శనానంతరం ఆలయ అధికారులు ప్రసాదాలు, శేషవస్త్రాలు, చిత్రపటాన్ని అందజేశారు. కాగా, నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు.. బీసీ జనార్దన్ రెడ్డి. ఏరాసు ప్రతాప్ రెడ్డి ఉమ్మడి జిల్లాలఘనస్వాగతం పలికారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement